• Home
  • wallpapers
  • tollywood
  • hotspot
  • news
  • gossips
  • bollywood
Facebook Twitter Instagram
  • Home
  • wallpapers
  • tollywood
  • hotspot
  • news
  • gossips
  • bollywood
Facebook Twitter Instagram
AtozpulseAtozpulse
Subscribe
  • Home
  • Services
  • About
  • Blog
  • Styles
  • Contact
AtozpulseAtozpulse
Home»gossips»కేటీఆర్‌ ఎఫెక్ట్..ఏపీలో రోడ్ల మరమత్తులకి నిధులు మంజూరు
gossips

కేటీఆర్‌ ఎఫెక్ట్..ఏపీలో రోడ్ల మరమత్తులకి నిధులు మంజూరు

By May 3, 2022No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు తక్షణం మరమత్తులు చేయడమో వాటి స్థానంలో కొత్త రోడ్లు వేయాలనో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తరచూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. ఎందుకంటే, ప్రతిపక్షాలు డిమాండ్ చేయగానే రోడ్లు వేసేస్తే ఆ క్రెడిట్ అవి సొంతం చేసుకొంటాయనే భయం వల్ల కావచ్చు.

ప్రతిపక్షాలు అడిగితే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం, పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఏపీలో రోడ్ల దుస్తితి గురించి చిన్న కామెంట్ చేయగానే, హడావుడిగా నిధులు మంజూరు చేసి పనులకి ముహూర్తం కూడా ఖరారు చేయడం విశేషం.

సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 9,000 కిమీ రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, వాటికి తక్షణం మరమత్తులు చేయాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి వాటి కోసం రూ.1,073 కోట్లు తక్షణం మంజూరు చేశారు.

Also Read  REVIEW : ALL THE BEST movie review by THEMEn

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పధకం కింద ఇదివరకు రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.83 కోట్లు బాకీ ఉందని అధికారులు చెప్పడంతో దానిని కూడా ఈ రూ.1,073 కోట్ల నుంచే తీసి చెల్లించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి ఈ నెల 15 నుంచి 20లోపుగా రోడ్డు మరమత్తు పనులు ప్రారంభించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఏపీ రోడ్ల పరిస్థితి గురించి కామెంట్ చేసినప్పుడు మన మంత్రులు వాటిని బలంగా తిప్పి కొట్టారు. కానీ రాష్ట్రంలో 9,000 కిమీ మేర రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, వాటికి తక్షణం మరమత్తులు చేయాల్సి ఉందని ఇప్పుడు అధికారులే చెప్పారు. వాటి కోసం నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్ నిజమని అంగీకరించినట్లయింది కదా?

పొరుగు రాష్ట్ర మంత్రి చేత ఇలా ఎద్దేవా చేయించుకొనే బదులు రాష్ట్రంలో ప్రతిపక్షాలు గుర్తుచేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమత్తులు చేయించి ఉంటే ఈ అవమానం తప్పేది కదా?ఇప్పుడు కూడా వర్షాకాలం ముందు రోడ్లు మరమత్తులు చేస్తున్నందున నాసి రకం పనులు చేస్తే వర్షాలకు అవీ కొట్టుకుపోవచ్చు. అప్పుడు కేటీఆర్‌ స్నేహితుడు మళ్ళీ సంక్రాంతి పండుగకు వచ్చి గుంతలు పడిన ఆ రోడ్లు చూసి ‘నాడు-నేడు’ ఒకేలా ఉందని చెప్పవచ్చు. కనుక కనీసం సంక్రాంతి వరకు నిలిచేలా కాస్త గట్టిగా రోడ్లు వేస్తే మంచిది.

Dallas Kamma Folks Behind Acharya Sales?
Balayya-Chiru’s ‘Naatu Naatu’ Moment!
Mirchi9.com: Number 2 Telugu Website!
This Week Releases on OTT – Check ‘Rating’ Filter
Follow Mirch9 on Google News

The post కేటీఆర్‌ ఎఫెక్ట్..ఏపీలో రోడ్ల మరమత్తులకి నిధులు మంజూరు appeared first on mirchi9.com.

Also Read  ‘Climax Will Be The Highlight Of Bhala Thandanana’

Related

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email

Related Posts

BB Non-Stop: Ep 86: Bindu vs Natraj

May 9, 2022

Ram Charan’s Firm Reply To Janasainiks

May 9, 2022

Mahesh Brought Vizag’s RK Beach To Hyderabad?

May 9, 2022
Add A Comment

Leave A Reply Cancel Reply

  • New
  • BB Non-Stop: Ep 86: Bindu vs Natraj
  • Ram Charan’s Firm Reply To Janasainiks
  • Mahesh Brought Vizag’s RK Beach To Hyderabad?
  • Anil Got Control Over Subject And Characters: Venky
Atozpulse
Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
  • Home
  • wallpapers
  • tollywood
  • hotspot
  • news
  • gossips
  • bollywood
© 2022 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.

  • Home
  • Services
  • About
  • Blog
  • Styles
  • Contact